కలం, సినిమా : గతంలో ప్రకటించిన విధంగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘ఓజీ2′(OG2) పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దర్శకుడు సుజీత్తో (Sujeeth) కలిసి కథా చర్చలు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ, ఇద్దరూ కలిసి స్టోరీ డిస్కషన్లో పాల్గొన్న ఫోటోను పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ విడుదల చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘ఓజీ’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించగా, ఇప్పుడు సీక్వెల్ ప్రకటనతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. ‘ఓజీ’ యూనివర్స్లో భాగంగా రాబోతున్న ఈ సీక్వెల్ కథ ఎలా ఉండబోతుందనే దానిపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
Read Also: ఉదయాన్నే నిద్రలేవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Follow Us On: X(Twitter)

