కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిలకలూరిపేట(Chilakaluripet) జెడ్పీహెచ్ ఎస్ స్టూడెంట్లకు 25 కంప్యూటర్లు సొంత నిధులతో అందజేశారు. ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని జనసైనికులు అంటున్నారు. పది రోజుల క్రితం ఇక్కడ జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న పవన్ కల్యాణ్(Pawan Kalyan).. విద్యార్థులకు కంప్యూటర్లు, గ్రంథాలయంలో పుస్తకాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పవన్ పంపించిన కంప్యూటర్లను కలెక్టర్ కృతిక శుక్ల, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కలిసి స్కూల్ కు అందజేశారు.
Read Also: రాజధాని లేక అవమానాలు ఎదుర్కున్నాం : చంద్రబాబు
Follow Us On: Sharechat


