కలం, వెబ్ డెస్క్ : తెలుగు భాషా ఖ్యాతి తెలుగు రాష్ట్రాల సరిహద్దులను దాటి దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెలుపల కూడా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే ప్రజలు (Telugu Speakers) భారీ సంఖ్యలో నివసిస్తున్నారని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ రెండు తెలుగు రాష్ట్రాల వెలుపల దేశవ్యాప్తంగా 1.04 కోట్ల మందికి పైగా తెలుగు మాట్లాడే వారు ఉన్నట్లు తేలింది.
ఇతర రాష్ట్రాలలో తెలుగు వారి జనాభాను పరిశీలిస్తే, పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రథమ స్థానంలో నిలిచింది. అక్కడ అత్యధికంగా 42.34 లక్షల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక నిలవగా, అక్కడ 35.69 లక్షల మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు. మహారాష్ట్రలో కూడా తెలుగు వారి సంఖ్య గణనీయంగా ఉంది, అక్కడ 13.21 లక్షల మంది నివసిస్తున్నారు. ఒడిశాలో 6.68 లక్షల మంది, ఛత్తీస్గఢ్లో 1.52 లక్షల మంది తమ మాతృభాషగా తెలుగును కలిగి ఉన్నారు.
ఇవే కాకుండా దేశంలోని మరికొన్ని ప్రాంతాలలో కూడా తెలుగు మాట్లాడే వారు (Telugu Speakers) చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో 0.88 లక్షల మంది, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 0.74 లక్షల మంది, అలాగే పశ్చిమ భారతదేశంలోని గుజరాత్లో 0.73 లక్షల మంది తెలుగు వారు స్థిరపడ్డారు. దీన్ని బట్టి దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశంలోని తూర్పు, పశ్చిమ, మధ్య ప్రాంతాలలో కూడా తెలుగు భాషా సంస్కృతులు బలంగా విస్తరించాయని తెలుస్తోంది.

