epaper
Monday, February 23, 2026
epaper

ఒకరు నేత్ర దానం.. మరొకరు శరీర దానం

కలం, ఖమ్మం బ్యూరో: తాము చనిపోతూ ఇతర జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు కొందరు. ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో ఒకరు మరణానంతరం నేత్ర దానం, మరొకరు శరీర దానం చేశారు. వివరాళ్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా గార్ల మండలం, కొత్త పోచారం గ్రామానికి చెందిన మన్నేపల్లి పూర్ణ చందర్‌రావ్ ఇటీవల మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యులు నేత్ర నిధికి నేత్రాలు (Eye) దానం చేసి మానవత్వం చాటుకున్నారు. మరోవైపు కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఆర్ఎంపీ వైద్యురాలు కొండూరు అనూష కీలక నిర్ణయం తీసుకుంది. తన మరణానంతరం శరీరాన్ని ప్రభుత్వ కళాశాలకు ఇచ్చేలా కుటుంబ సభ్యులను ఒప్పించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>