కలం, నిర్మల్ : వివిధ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈ నెల 22న బహిరంగ వేలం (Vehicle Auction) నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ రంగస్వామి తెలిపారు. నిర్మల్ (Nirmal) జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వి. శ్రీనివాస్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో ఉదయం 10 గంటలకు వేలంపాట ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ వేలంలో పాల్గొనాలనుకున్నవారు నిర్ణీత డిపాజిట్ చెల్లించి భాగస్వామ్యులు కావాలని తెలిపారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం ఎక్సైజ్ శాఖను సంప్రదించాలని సూచించారు.
Read Also: ఢిల్లీ నిరసనలో నిర్మల్ ఆప్ నేత
Follow Us On: Instagram

