రిటైర్ అయిన నాలుగు రోజులకే ఏఎస్సైకి గుండెపోటు

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ పోలీసు శాఖలో సుదీర్ఘంగా సేవలు అందించి రిటైర్ అయిన నాలుగు రోజులకే క్రితం ఏఎస్సై గంగాధర్ గౌడ్ (ASI Gangadhar Goud)  గుండెపోటు సంభవించింది. సడన్ హార్ట్ ఎటాక్ తో ఆయన మృతి చెందారు. నిజామాబాద్ గంగాస్థాన్ ఫేజ్-1కి చెందిన కె.గంగాధర్ గౌడ్ స్పెషల్ బ్రాంచ్ లో ఏఎస్సైగా పనిచేశారు.

ఆగస్టు 31నే పదవీ విరమణ చేశారు. కాగా.. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉండగా గుండెపోటుతో మృతి చెందారు. దీంతో కుటుంబంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. పోలీసు శాఖకు ఈ సంఘటన షాక్ కు గురి చేసింది.. ఆయన మృతదేహానికి జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ నివాళులర్పించారు. పలువురు పోలీసు అధికారులు సంతాపం ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>