కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కలిశారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి దావోస్కు వెళ్లిన ముఖ్యమంత్రిని అక్కడ లోకేశ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.


