కలం, వరంగల్ బ్యూరో: ములుగు (Mulugu) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక (Minor girl) పై సర్పంచ్ భర్త అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్నాయిగూడెం మండలంలో ఈ ఘటన జరిగింది. మండలంలోని ఓ గ్రామంలో బాలికపై సర్పంచ్ భర్త శ్రీకాంత్ అత్యాచారయత్నం చేశారు. స్థానిక ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఇంటర్ చదువుతున్న ఓ బాలిక తల్లిదండ్రుల మాట వినడం లేదు. ఈ విషయమై బాలికను భయపెట్టి, ఆమెకు బుద్ధి చెప్పాలని కుటుంబసభ్యులు ఊరి పెద్ద శ్రీకాంత్ను కోరారు. ఈ క్రమంలో ఓ రోజు మధ్యాహ్నం వారి ఇంటికి వెళ్లిన శ్రీకాంత్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించి బయటకు వచ్చి కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

