కలం, వెబ్డెస్క్: నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రధానమంత్రిగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కోసం పర్యటించడాన్ని మేము స్వాగతిస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గత ప్రభుత్వం మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా కాంగ్రెస్ చేతిలో పెట్టి పోయిందని గుర్తుచేశారు. ప్రధానమంత్రి తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంగా పలు అంశాలపై మాట్లాడాలని ఎంపీ డిమాండ్ చేశారు.
వాటిలో.. విభజన హామీలో భాగంగా భద్రాచలంలో ఉన్న 5 ముంపు గ్రామాలకు సంబంధించిన అంశం, బయ్యారం హామీ, పెండింగ్ ఉన్న అంశాల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీ బిడ్డలకు ఇచ్చిన వాగ్దానం మేరకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో తీర్మాణం చేసి, క్యాబినెట్లో ఆమోదం చేసి ఢిల్లీకి పంపించిందని గుర్తుచేశారు. రిజర్వేషన్ బిల్లుపై కూడా తెలంగాణ బీసీ బిడ్డలను ఉద్దేశించి ఒక బీసీ నాయకుడిగా ప్రధాని మాట్లాడాలని ఎంపీ అన్నారు. పెండింగ్లో ఉన్న హామీలను ఏం చేస్తారో ప్రధానమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.
జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని ప్రధాని చెప్పారని, కానీ దానికి సంబంధించిన అంశాలు జనగణన దాంట్లో పెట్టలేదని ఎంపీ అన్నారు. ఇటీవలి పార్లమెంట్ నిర్వహించి డీలిమిటేషన్, సీట్ల పెంపు గురించి మాట్లాడారని అన్నారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని చెప్పడానికి ప్రయత్నించారని ఎంపీ విమర్శించారు. కానీ తాము మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదని పదే పదే చెప్తున్నా బీజేపీ నాయకులు వినలేదన్నారు. ఈరోజు తెలంగాణకు వచ్చినప్పుడు మోడీ తప్పకుండా ఈ అంశాల గురించి ప్రస్తావించాలని ఎంపీ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని గుర్తుచేశారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ డెవలప్మెంట్కు సహకరించాలి కోరారు. బీసీ కులగణన అంశం మీద కూడా మోడీ స్పందిచాలని కోరుతున్నామని అన్నారు.

