పిల్ల‌ల గొంతు కోసి త‌ల్లి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

క‌లం, వెబ్ డెస్క్‌: యాదాద్రి భువ‌న‌గిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మ‌హిళ త‌న ఇద్దరు పిల్ల‌ల గొంతు కోసి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఈ ఘ‌ట‌న భువ‌న‌గిరి మండ‌లం తుక్కాపురంలో జ‌రిగింది. నీలిమ అనే మ‌హిళ బెజ్జంకిలో నివాసం ఉంటుంది. రెండు రోజుల క్రితం త‌న కుమారుడు, కుమార్తెతో త‌ల్లి ఇంటికి వ‌చ్చింది. శ‌నివారం రాత్రి పిల్ల‌ల‌పై క‌త్తితో దాడి చేసింది. ఈ దాడిలో నీలిమ కుమార్తె కృతిక రెడ్డి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. అనంత‌రం నీలిమ ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేసింది. స్థానికులు గ‌మనించి నీలిమ‌ను, ఆమె కొడుకును ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. నీలిమ ఎందుకు ఇలా చేసింద‌న్న విష‌యం తెలియాల్సి ఉంది. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>