Mobile Popup Ad
Mobile Popup Ad

వేలేరు-హైదరాబాద్ నూతన బస్సు ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda) జిల్లా వేలేరు నుండి హైదరాబాద్ వెళ్లే నూతన ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీస్‌ను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari) సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ బస్సు వేలేరులో ఉదయం 4 గంటలకు బయలుదేరి కమ్మరిపేట, బండ తండా, నారాయణగిరి, ముప్పారం, సాయిపేట, క్యాతంపల్లి, పెద్దపెండ్యాల, కరుణాపురం మీదుగా సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ కు రాత్రి 8 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరి రాత్రి 8 గంటలకు వేలేరుకు చేరుకుంటుందని తెలిపారు.

ప్రయాణికులు ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ఎక్స్ ప్రెస్ సర్వీస్ ద్వారా మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందవచ్చని అన్నారు. జూన్ 2వ తేదీ నుండి వేలేరు వరకు వచ్చే బస్సులను గొల్లకిష్టంపల్లి వరకు పొడిగించనున్నట్లు ప్రకటించారు. ఈ బస్సు సర్వీస్ వెళ్లే ఆయా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనగామ ఆర్టీసీ డిపో మేనేజర్, వేలేరు, ధర్మసాగర్ మండలాల సర్పంచులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>