కలం, మహబూబ్ నగర్ డెస్క్: నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి గ్రామంలో మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులను మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించి, వేగంపై ఆరా తీశారు.
కాగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల పరిశీలనలో భాగంగా గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సీఎం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి కాట్రేవుపల్లి గ్రామంలో జరుగుతున్న ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు.

