కలం, వెబ్డెస్క్: అమెరికా విధించిన టారిఫ్స్తో ఇప్పటికే సతమతమవుతున్న భారత్పై మరో దేశం టారిఫ్స్ కత్తిదూసింది. ఇండియా నుంచి వచ్చే దిగుమతులపై 50శాతం సుంకాలు (Mexico Tariffs) విధిస్తున్నట్లు మెక్సికో ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చే ఉత్పత్తుల వల్ల తమ దేశీయ మార్కెట్ దెబ్బతింటోందని, ఉపాధి కరువవుతోందని చెబుతూ మెక్సికో ఈ చర్యకు దిగింది. తమతో వాణిజ్య ఒప్పందం(ట్రేడ్ డీల్) లేని భారత్తోపాటు చైనా, దక్షిణ కొరియా, థాయ్లాండ్, ఇండోనేషియా తదితర దేశాలకు పెంచిన టారిఫ్స్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయని చెప్పింది. కొత్త పన్నుల వల్ల తమకు 3.8 బిలియన్ల డాలర్ల అదనపు ఆదాయం సమకూరుతుందని, అలాగే దేశీయ ఉత్పత్తి, ఉపాధి రంగాలకు ఊతం లభిస్తుందని మెక్సికో అంచనా వేస్తోంది. తమ దేశ ఆర్థికాభివృద్ధి కోసమే ఈ టారిఫ్స్ వేసినట్లు చెబుతున్నప్పటికీ అమెరికాను సంతృప్తి పరిచేందుకే మెక్సికో నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, టారిఫ్స్పై మెక్సికో నిర్ణయాన్ని ఏకపక్షమని పేర్కొన్న చైనా, దీని ప్రభావాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పింది. భారత ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు.
వీటిపైన సుంకాలు..:
ఆటోపార్ట్స్, లైట్ కార్స్, దుస్తులు, ప్లాస్టిక్స్, స్టీల్, గృహోపకరణాలు, బొమ్మలు, టెక్స్టైల్స్, ఫర్నిచర్, ఫుట్వేర్, లెదర్ గూడ్స్, పేపర్, కార్డ్బోర్డ్, మోటార్సైకిల్స్, అల్యూమినియం, ట్రైలర్స్, గ్లాస్, సోప్స్, పెర్ఫ్యూమ్స్, కాస్మోటిక్స్.
భారత్పై ప్రభావం..:
ఏటా భారత్ నుంచి 5.3బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు కెనడాకు ఎగుమతి అవుతాయి. ఇందులో 1 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఆటో మొబైల్ రంగం నుంచి వెళతాయి. వోక్స్వ్యాగన్, హ్యుండయ్, నిస్సాన్, మారుతి సుజుకి కార్లు, విడిభాగాలు వీటిలో ఉన్నాయి. మెక్సికో టారిఫ్స్(Mexico Tariffs) ప్రభావం వీటిపై గణనీయంగా పడనుంది. భారత్ నుంచి అత్యధికంగా దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా తర్వాత కార్లు అత్యధికంగా మెక్సికోకు కార్లు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుత టారిఫ్స్ తమకు ఇబ్బందికరంగా మారతాయని, కేంద్ర ప్రభుత్వం దీనిపై మెక్సికోతో మాట్లాడాలని ఆటోమొబైల్ ఇండస్ట్రీ సంఘం కోరుతోంది.
Read Also: బిహార్లోని సీతామర్హిలో ఎయిడ్స్ కలకలం
Follow Us On: Youtube


