కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా తూప్రాన్ (Toopran) సమీపంలో నాగ్పూర్–హైదరాబాద్ జాతీయ రహదారి NH44పై భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు, కంటైనర్లో తరలిస్తున్న 8 మారుతి కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో వాహనదారులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిప్రమాదం కారణంగా హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను పోలీసులు తాత్కాలికంగా నిలిపివేసి ట్రాఫిక్ను మళ్లించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-కంటైనర్ దగ్ధం.. బూడిదైన 8 కార్లు
-మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద నాగ్ పూర్ హైవే NH 44 పై అగ్నిప్రమాదం.
-కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.
-కంటైనర్ లోని 8 మారుతీ కార్లు పూర్తిగా దగ్ధం.
-ఫైర్ సిబ్బంది, పోలీసులకు వాహనదారులు సమాచారం.
-అగ్ని… pic.twitter.com/ga1VmjfVXt— Kalam Daily (@kalamtelugu) May 21, 2026
Read Also: బండి భగీరథ్ ఎపిసోడ్పై సీఎం సంచలన రియాక్షన్
Follow Us On : WhatsApp

