కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా సమతుల్యాన్ని కాపాడడానికి నగదు ప్రోత్సాహం అందించాలని ఉత్తర్వులు జరీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ముగ్గురు పిల్లలను కలిగిన కుటుంబాలకు రూ.5,000 ప్రోత్సాహకం అందించనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న జనాభా విధానంలో భాగంగా ఈ ప్రోత్సాహకాన్ని అర్హులైన కుటుంబాలకు అందించనున్నారు.
ఏపీలో జననాల రేటు తగ్గుతున్న నేపథ్యంలో కుటుంబాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అర్హత గల కుటుంబాలు సంబంధిత గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
అయితే, ఈ ప్రోత్సహకాలకు సంబంధించిన పూర్తి అర్హతలు, అమలు విధానం, దరఖాస్తు ప్రక్రియ, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశాలపై గవర్నమెంట్ త్వరలోనే సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేయనుంది. కాగా, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో జనాభా విధానంపై మరోసారి చర్చ మొదలైంది.

