కలం, వెబ్ డెస్క్: మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ లో తమ పార్టీ ఓడిపోలేదని వ్యాఖ్యానించారు. ఓట్ల చోరీ జరిపి ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఆమె ఆరోపించారు. తాను లోక్ భవన్ ను వెళ్లబోనని రాజీనామా చేయనని ఆమె ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఆమె మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు.
Read Also: 7న విజయ్ ప్రమాణ స్వీకారం? రేపు గవర్నర్తో భేటీ
Follow Us On : WhatsApp

