Mobile Popup Ad
Mobile Popup Ad

జమలాపురం వేంకటేశ్వర స్వామి ఆలయ మహాకుంభాభిషేకం!

​కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జమలాపురం వేంకటేశ్వర స్వామి ఆలయం (Jamalapuram Temple)లో మహాకుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శృంగేరి శారదా పీఠం 37వ జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీ స్వామి వారి అమృత హస్తాల మీదుగా ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేష ఆధ్యాత్మిక ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

​మహాకుంభాభిషేకాన్ని పురస్కరించుకుని ఆలయానికి వచ్చిన భక్తులందరికీ వేంకటేశ్వర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహనరావు, ధర్మకర్త విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ, ప్రముఖ దాత తుళ్లూరు కోటేశ్వరరావుతో పాటు ఆలయ అర్చక బృందం, సిబ్బంది, భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>