epaper
Wednesday, February 18, 2026
epaper

లోక్​సభ రేపటికి వాయిదా

కలం, వెబ్​డెస్క్​: బడ్జెట్​ సమావేశాల్లో బుధవారం మళ్లీ అదే తీరు. అధికార, విపక్షాల ఆందోళనలు, నిరసనల మధ్య లోక్​సభ గురువారానికి వాయిదా పడింది (Lok Sabha). ఈ ఉదయం సభ ప్రారంభమైన కాసేపటికే.. డోక్లాం సంఘటనపై మాజీ ఆర్మీ చీఫ్​ ఎంఎం నరవణే ఆత్మకథలోని మాటల్ని రాహుల్​ మరోసారి ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన మాట్లాడేందుకు స్పీకర్​ అనుమతించలేదు. దీంతో ఇండియా కూటమి సభ్యులు భగ్గుమన్నారు.

ప్రతిగా అధికార పార్టీ ఎంపీలు బదులివ్వడంతో మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో గందరగోళం చెలరేగింది. దీంతో సభ వాయిదా పడింది. అనంతరం సమావేశమైనప్పటికీ మళ్లీ అదే పరిస్థితి తలెత్తింది. సభను (Lok Sabha) మరోసారి వాయిదా వేశారు. చివరగా సాయంత్రం 5గంటలకు సభ ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో సభను స్పీకర్​ రేపటికి వాయిదా వేశారు.

Read Also: విద్యుత్ స్థంభాలు, గృహ కనెక్షన్లపై కీలక మార్పులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>