కలం, వెబ్డెస్క్: పంజాబ్లోని (Punjab) ఓ లా కాలేజీలో షాకింగ్ ఘటన జరిగింది. తోటి విద్యార్థిని కాల్చి చంపి, తానూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు మరో విద్యార్థి (Law Student Shot Dead). ఈ తతంగం సీసీ కెమెరాల్లో రికార్డవడంతో వైరలైంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. తర్న్ తరన్ జిల్లా ఉస్మాలోని మై భాగో లా కాలేజీలో ప్రిన్స్ రాజ్, సందీప్ కౌర్ చదువుతున్నారు. సోమవారం ఉదయం క్లాసులు ప్రారంభమవుతాయనగా, క్లాస్రూమ్లోకి వచ్చిన ప్రిన్స్ రాజ్.. అప్పటికే అక్కడ ఉన్న సందీప్ కౌర్తో ఏదో విషయమై మాట్లాడాడు.
కాసేపటికి సందీప్ కౌర్ చివరి బెంచీలోకి వెళ్లి కూర్చుంది. మరో విద్యార్థి పక్కనే నిలబడి మాట్లాడుతోంది. వాళ్లతోపాటు అక్కడికి వచ్చిన ప్రిన్స్ రాజ్ హఠాత్తుగా బ్యాగ్ తెరిచి అందులోని గన్ బయటకు తీశాడు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో సందీప్ కౌర్ తలకు గురిపెట్టి కాల్చాడు. అనంతరం తనను తాను కాల్చుకొని కింద కూలబడిపోయాడు. ఈ హఠాత్ సంఘటనతో అక్కడే ఉన్న మరో విద్యార్థికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. తర్వాత సందీప్ కౌర్ను పట్టుకొని పైకి లేపేందుకు ప్రయత్నించారు. అయితే, సందీప్ కౌర్ అప్పటికే చనిపోయింది.
కాల్పుల శబ్దం విని విద్యార్థులు, లెక్చరర్లు తరగతి గది లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు. విషమ పరిస్థితిలో ఉన్న ప్రిన్స్ రాజ్ను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ కాల్పులకు కారణమేదో తెలియరాలేదు (Law Student Shot Dead). పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: తెలంగాణ రాజకీయాలను మునుగోడు నుంచే శాసిస్తా : రాజగోపాల్ రెడ్డి
Follow Us On: Sharechat


