కలం, వెడ్ డెస్క్ : గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ సింగరేణి (Singareni)ని విధ్వంసం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ ప్రయోగశాలగా సింగరేణిని మార్చారని ఆయన దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎలా పనిచేసిందో కాంగ్రెస్ అలానే పని చేస్తోందని విమర్శించారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కేంద్రం సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఒడిశా రాష్ట్రంలో బీజేపీ వచ్చాక.. అక్కడి ప్రభుత్వంతో అనుమతులపై చర్చించామని చెప్పారు. నైనీ బొగ్గు గనులకు సంబంధించి చివరి అనుమతులు వచ్చినా పనులు ఎందుకు ఆలస్యం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. నైనీ బ్లాకు విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు.
Read Also: ‘సిట్’ ముందుకు కవిత?.. త్వరలో సమన్లు జారీ?
Follow Us On : WhatsApp


