నిజామాబాద్‌లో ఖేలో ఇండియా విలువిద్య శిక్షణ

కలం, నిజామాబాద్ బ్యూరో: మనం ఎంచుకున్న రంగంలో కష్టపడితేనే ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని నిజామాబాద్ జిల్లా యువజన క్రీడల అధికారి బీ పవన్ కుమార్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఖేలో ఇండియా విలువిద్య శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. విలువిద్యలో రాణించాలంటే ఎంతో కష్టపడి అంకితభావంతో సాధన చేస్తేనే సాధ్యమవుతుందన్నారు. DYSO‌ను ఖేలో ఇండియా విలు విద్య శిక్షకుడు మద్దుల మురళి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ వారు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>