Mobile Popup Ad
Mobile Popup Ad

సిద్ధ‌రామ‌య్య రాజీనామా.. కేసీ వేణుగోపాల్ రియాక్ష‌న్‌

క‌లం, వెబ్ డెస్క్: క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి సిద్ధ రామ‌య్య (Siddaramaiah) రాజీనామా చేసిన నేప‌థ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్(KC Venugopal) ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా కీలక పోస్ట్ చేశారు. సిద్ధరామయ్య నేతృత్వంలో కర్ణాటక రాష్ట్రం అద్భుతమైన వృద్ధిని సాధించిందని, ఆయన పాలన కేవలం కాగితాలకే పరిమితం కాకుండా సమాజంలోని అట్టడుగు వర్గాలకు సైతం చేరిందని కొనియాడారు. సామాన్య వ్యవసాయ నేపథ్యం నుండి వచ్చిన సిద్ధరామయ్య, తన సిద్ధాంత నిబద్ధత, ప్రజా సేవ చేయాలనే పట్టుదలతో రాష్ట్ర అత్యున్నత పదవికి ఎదిగారన్నారు. పేదలు, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం ఆయన చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని పేర్కొన్నారు.

పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సిద్ధరామయ్య తీసుకున్న నిస్వార్థ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంతగానో అభినందిస్తోందని వేణుగోపాల్ తెలిపారు. ఆయన ప్రదర్శించిన హుందాతనం, పరిణతి, ఒక ఉన్నత స్థాయి ప్రజా నాయకుడు ఎలా వ్యవహరించాలో చెప్పడానికి నిదర్శనమని ప్రశంసించారు. సిద్ధరామయ్య భవిష్యత్తు ప్రయాణం దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లక్ష్యాల సాధనలో సిద్ధరామయ్య జ్ఞానం, అనుభవం వెలకట్టలేనివని, ఆయన ఎప్పటికీ తమ పార్టీకి అత్యంత విలువైన నాయకుడిగా ఉంటారని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>