కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జాగృతి అధ్యక్షురాలు కవితకు క్లీన్ రావడంతో సింగరేణి జాగృతి (Singareni Jagruthi) ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ఎంఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వెంకట్ ఆధ్వర్యంలో.. సంబురాలు నిర్వహించారు. ‘న్యాయం గెలిచింది. ధర్మం నిలిచింది’ అని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పటాకులు పేల్చి స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణకు ఇది ఒక శుభవార్త అని అందరం సంతోషించాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా నాయకులు సునీల్, హెచ్ఎమ్ఎస్ నాయకులు బ్రాంచ్ కార్యదర్శి శ్రీకాంత్, అనిల్ కుమార్, సోషల్ మీడియా ఇంచార్జ్ బబ్లు, సతీష్, శ్యామ్, వేణు శంకర్, అబ్బాస్ సాయి, అంజి తదితరులు పాల్గొన్నారు.

