epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ట్రిపుల్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చండి: కవిత 

కలం, వెబ్‌డెస్క్: ట్రిపుల్‌ ఆర్ అలైన్‌మెంట్ మార్చి తీరాల్సిందేనని జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) డిమాండ్ చేశారు. ట్రిపుల్‌ఆర్ వల్ల యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కవిత పేర్కొన్నారు.  తెలంగాణ జాగృతి జనం బాట(Jagruthi Janam Bata) కార్యక్రమంలో మంగళవారం భువనగిరి జిల్లాలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. యాదాద్రి జిల్లాలో నిర్మించిన ఎయిమ్స్(AIIMS) పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. గుత్తెదారు బిల్డింగ్స్ కట్టడంలో ఆలస్యం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కాంట్రాక్టర్ ఆలస్యం చేస్తున్నాడని ఆరోపించారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు నిలదీస్తూ ముందుకు వెళ్తున్నాం’ అంటూ కవిత పేర్కొన్నారు.

‘ఇప్పటికి 16 జిల్లాల్లో పర్యటించాం. ఆయా జిల్లాలో ఉన్న సమస్యలు చూస్తూ వచ్చాం. ప్రభుత్వాలను నిలదీస్తూ ముందుకు వెళ్లాం. అనేక సమస్యలు మా చొరవ వల్ల పరిష్కారం అయ్యాయి. అనేక సమస్యలు మా చొరవ వల్ల పరిష్కారం చూపిస్తూ ఉన్నాం. ఎయిమ్స్ 2016 సమయంలో యాదాద్రి జిల్లాకు వచ్చింది. కానీ ఇక్కడ పెద్దగా వసతులు లేవు. కనీసం ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా అందుబాటులో లేదు. ఇక్కడి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చింది’ అని కవిత పేర్కొన్నారు.

ఎయిమ్స్‌లో పెండింగ్ పనులు వెంటనే పూర్తయ్యేలా చూడాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు కవిత(Kavitha) సూచించారు. ఆ బాధ్యత మంత్రుల మీద ఉందని పేర్కొన్నారు. భువనగిరి సమీపంలోని రాయగిరి గ్రామ రైతులు ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో ఇక్కడ పర్యటించిన ప్రియాంకా గాంధీ అలైన్ మెంట్ మార్చుతామని హామీ ఇచ్చారని.. ఆ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్న రైతులను జైలుకు పంపించడం పంపించడం అన్యాయమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ రైతులను జైలుకు పంపించారని వాపోయారు.  రైతుల పక్షాన జాగృతి పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.
Follow Us On: X(Twitter)
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>