కలం, వెబ్ డెస్క్: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) సంచలన ప్రకటన చేశారు. యుద్ధం ఆపేందుకు ఇరాన్తో చర్చలు జరుపుతానని పేర్కొన్నారు. తాను చర్చలు పూర్తిచేసేందుకు వీలుగా 72 గంటల పాటు యుద్ధం ఆపాలంటూ అమెరికా, ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో శుక్రవారం ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీకి భారత్లో పత్యేక ప్రతినిధి అయిన అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీని కలిసిన ఫోటోను ట్వీట్కు జతచేశారు. ఇలాహీతో చర్చలు జరిపినట్లు పాల్ వెల్లడించారు.
తాను ఇరాన్ (Iran) తరఫున మధ్యవర్తిత్వం వహించి, యుద్ధ విరమణకు కృషి చేసేందుకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా యుద్ధం ఆపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump), ఇజ్రాయెల్ నేతలకు కేఏ పాల్ (KA Paul) విన్నవించారు. ఇరాన్తో తాను శాంతి చర్చలు జరుపుతానని, 72గంటల పాటు సీజ్ఫైర్ చేయాలని కేఏ పాల్ వాళ్లను కోరారు.
Read Also: ఎప్స్టీన్ ఫైల్స్ సంచలనం.. మైనర్పై ట్రంప్ అకృత్యాలు!
Follow Us On: Facebook

