epaper
Wednesday, February 18, 2026
epaper

జేఈఈ మెయిన్​ ప్రొవిజినల్ ఆన్సర్​​ కీ రిలీజ్​

కలం, వెబ్​డెస్క్​: దేశవ్యాప్తంగా ప్రసిద్ధ ఎన్​ఐటీలు, ఐఐటీలు, సీఎఫ్​టీఐల్లో ఇంజనీరింగ్​, ఆర్కిటెక్చర్​ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్​–2026 (JEE Main 2026) ప్రొవిజినల్​ ఆన్సర్​ కీ రిలీజైంది. గత నెల 21 నుంచి 29 వరకు సెషన్​‌‌–1 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన ప్రొవిజినల్​ ​ కీ, రెస్సాన్స్​ షీట్లను నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ(NTA) బుధవారం విడుదల చేసింది. కీపై అభ్యంతరాలను ఈరోజు(ఫిబ్రవరి 4) నుంచి ఈ నెల 6వ తేదీ 11.50 గంటలకు వరకు తెలిపేందుకు అవకాశం కల్పించింది.

అభ్యర్థులు నేషనల్​ డిపార్ట్​మెంట్​ ఆఫ్​ హయ్యర్​ ఎడ్యుకేషన్​ వెబ్​సైట్​లోకి వెళ్లి.. అక్కడ ఇచ్చిన లింక్​ క్లిక్​ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్​ నెంబర్​, పాస్​వర్డ్​, క్యాప్చా కీ ఎంటర్​ చేసి కీ, రెస్సాన్స్​ షీట్ (అభ్యర్థులు రాసిన పరీక్షలకు సంబంధించిన మార్కుల డిజిటల్​ షీట్​)​ సరిచూసుకోవచ్చు. అభ్యంతరాలు తెలిపేందుకు ఒక్కో ప్రశ్నకు రూ.200 రుసుము నిర్ణయించారు. అభ్యంతరాల పరిశీలన ముగిశాక, ఈ నెల 12 లోపు ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి దేశవ్యాప్తంగా దాదాపు 14.5లక్షల మంది జేఈఈ మెయిన్ ​(JEE Main 2026) కు అప్లయ్​ చేసుకున్నారు. వీరిలో 13 లక్షల మంది పరీక్షలు రాశారు.

Read Also: మరో ఆరుగురితో అరవ శ్రీధర్‌కు లింక్స్.. బాధితురాలి సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>