Mobile Popup Ad
Mobile Popup Ad

జగిత్యాల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు : ఎస్పీ అశోక్ కుమార్

కలం, కరీంనగర్ బ్యూరో : శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నెల రోజులు (జూలై 1వ తేది నుండి 31 వరకు) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, నిబంధనలకు విరుద్దంగా డీజే వినియోగించరాదని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. జిల్లా ప్రజలు పోలీసులకు ఈ విషయంలో సహకరించాలని ఎస్పీ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>