Mobile Popup Ad
Mobile Popup Ad

అమెరికా ప్రయాణానికి ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు సిద్ధం

కలం, వెబ్ డెస్క్: 2026 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌( Football World Cup)కు ముందు ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు కీలక అడుగు వేసింది. అమెరికా వెళ్లే ముందు చివరి సన్నాహక మ్యాచ్‌ల కోసం జట్టు సోమవారం టర్కీకి బయలుదేరింది. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా వెల్లడించింది. టస్నీమ్ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, 22 మంది దేశీయ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కలిసి అంటాల్యాకు చేరుకోనున్నారు. అక్కడే జట్టు చివరి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది.

శనివారం జట్టు హెడ్ కోచ్ అమీర్ ఘలెనోయి మాట్లాడుతూ.. అమెరికా వీసా దరఖాస్తుల ప్రక్రియను కూడా టర్కీలోనే పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆటగాళ్లకు ఇంకా వీసాలు జారీ కాలేదని ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు మెహ్దీ తాజ్ తెలిపారు. వీసా ప్రక్రియలో భాగంగా ఆటగాళ్లు వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంటుందని, అయితే అంటాల్యా నుంచి అంకారాకు 380 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయకుండా ఉండాలని జట్టు భావిస్తున్నట్లు సమాచారం.

ఇదే సమయంలో.. ఇరాన్, అమెరికా మధ్య ఇటీవల జరిగిన ఉద్రిక్త పరిస్థితుల తర్వాత తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల మధ్యే ఇరాన్ జట్టు వరల్డ్‌కప్ (Football World Cup) సన్నాహాలు కొనసాగిస్తోంది. అంటాల్యాలో ఇరాన్ రెండు సన్నాహక మ్యాచ్‌లు ఆడాలని భావిస్తోంది. ఇందులో మే 29న గాంబియాతో మ్యాచ్ ఇప్పటికే ఖరారైంది. ఈ మ్యాచ్‌ల ఏర్పాట్లను ఇరాన్-కెనడియన్ నిర్వాహకుడు సామ్ మెహ్దిజాదెహ్ సమన్వయం చేస్తున్నారు.

శనివారం టర్కీలో ఫిఫా కార్యదర్శి జనరల్ మత్తియాస్ గ్రాఫ్‌స్ట్రోమ్ ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీ సానుకూలంగా సాగినట్లు ఇరాన్ సమాఖ్య కూడా వెల్లడించింది. అమెరికా చేరుకున్న తర్వాత ఇరాన్ జట్టు అరిజోనాలోని టక్సన్ నగరంలో తమ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకోనుంది. గ్రూప్-జీలో ఉన్న ఇరాన్, జూన్ 15న లాస్ ఏంజెల్స్‌లో న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత అదే నగరంలో బెల్జియంతో, అనంతరం సియాటిల్‌లో ఈజిప్ట్‌తో తలపడనుంది.

Read Also: ప్రతి అమ్మాయి తన బ్యాగ్‌లో తప్పక ఉంచుకోవాల్సిన భద్రతా వస్తువులు ఇవే

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>