క్రికెట‌ర్‌ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

క‌లం, వెబ్ డెస్క్‌: భార‌త క్రికెట‌ర్ రింకూ సింగ్ (Rinku Singh) తండ్రి ఖంచంద్ర సింగ్ శుక్ర‌వారం తెల్ల‌వారుజామున క‌న్ను మూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఖంచంద్ర సింగ్ కొంత‌కాలంగా స్టేజ్-4 లివ‌ర్ క్యాన్స‌ర్‌తో బాధ ప‌డుతున్నారు. ఇటీవ‌ల ఆయన ఆరోగ్యం బాగా క్షీణించ‌డంతో గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆస్పత్రికి త‌ర‌లించారు. కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. శుక్ర‌వారం ఉద‌యం మృతి చెందారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న రింకూ సింగ్‌ హుటాహుటిన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు బయలుదేరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>