epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆర్మీ సిబ్బంది ఇన్ స్టాగ్రామ్​ వాడోచ్చు.. కానీ..

కలం, వెబ్​ డెస్క్​ : సోషల్​ మీడియా వినియోగంపై భారత రక్షణ శాఖ కఠినంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో Indian Army మరోసారి సైన్యంలోని సిబ్బందికి సామాజిక మాధ్యమాల (Social Media) వినియోగంపై కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. జవాన్లు, సైనిక అధికారులు ఇన్​ స్టాగ్రామ్ ను చూడడానికి అనుమతి ఇచ్చింది. అయితే.. ఇన్​ స్టా, ఎక్స్​ లో ఎలాంటి వ్యాఖ్యలు తెలపకూడదని, కేవలం పర్యవేక్షణ ప్రయోజనాల కోసమే వినియోగించాలని సూచించింది.

ఈ అప్లికేషన్లలో పోస్టింగ్స్​, లైకులు, వ్యాఖ్యలపై పూర్తి నిషేధం విధించింది. భద్రత, సున్నితమైన సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని.. జాతీయ భద్రత కోసం మార్గదర్శకాలను తప్పకుండా పాటించాల్సిందేనని ఆర్మీ స్పష్టం చేసింది. అలాగే, సోషల్​ మీడియా వినియోగంపై ఎప్పటికప్పుడు సమీక్ష కొనసాగుతుందని ఆర్మీ పేర్కొంది. డిజిటల్ అవగాహనతో పాటు దేశ భద్రతకు ముప్పు తలెత్తకుండా సైనికులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.

కాగా, హనీట్రాప్​, డబ్బుల ఆశ చూపి సమాచారాన్ని దొంగిలించే ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో రక్షణ శాఖ సామాజిక మాధ్యమాల వినియోగంపై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే 2022లో ఫేస్​ బుక్​, ఇన్​ స్టాగ్రామ్ సహా మొత్తం 89 మొబైల్​ అప్లికేషన్లను సిబ్బంది వాడకుండా ఆర్మీ బ్యాన్​ విధించింది. తరువాత పరిస్థితుల ఆధారంగా కొన్ని సడలింపులు తీసుకొచ్చింది. సైన్యంలోని సిబ్బందికి ప్రస్తుతం ఫేస్​ బుక్​, యూ ట్యూబ్​, ఎక్స్​, లింక్డ్​ఇన్​, టెలిగ్రామ్​, వాట్సప్​ వంటి యాప్​ లను పాక్షికంగా వినియోగించుకునే వెసులుబాటును కల్పిస్తూ Indian Army కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>