కలం, వెబ్ డెస్క్ : రక్షణ వ్యవస్థ సామర్థ్యంలో భారత్ కు మరో మైలురాయి దక్కింది. అగ్ని-4 మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని (Agni-4 Ballistic Missile) విజయవంతంగా పరీక్షించారు. గురువారం ఒడిశా చండీపూర్ లోని ITR నుంచి అగ్ని-4 క్షిపణి ప్రయోగించారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ప్రయోగం చేపట్టారు. ఈ మేరకు పరీక్ష విజయవంతంగా ముగిసిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

