బౌలింగ్ గైడెన్స్ కోసం భారత్ ఫోన్ చేసింది: పాక్

కలం, వెబ్ డెస్క్: ఫాస్ట్ బౌలింగ్ కోసం భారత్ గైడెన్స్ అడిగిందంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) హై-పర్ఫార్మెన్స్ డైరెక్ర్ ఆకిబ్ జావేద్ చెప్పుకొచ్చాడు. ఆసియాకప్ విజయం తర్వాత భారత్ నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని, అందులో భారత్ ఈ రిక్వెస్ట్ చేసిందని ఆకిబ్ చెప్పారు. పీసీబీ నిర్వహిస్తున్న ఓవర్సీస్ ప్లేయర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఈ అభ్యర్థన వచ్చిందని తెలిపారు.

పీసీబీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆకిబ్, నేషనల్ హై-పర్‌ఫార్మెన్స్ సెంటర్ , నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. 2006 నుంచి పనిచేయని, ఐసీసీ గుర్తింపు పొందిన బయోమెకానిక్స్ ల్యాబ్ త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని చెప్పారు. ఈ సౌకర్యం ద్వారా అక్రమ బౌలింగ్ చర్యలను గుర్తించడంతో పాటు ఆటగాళ్ల ప్రదర్శనను మెరుగుపరచవచ్చన్నారు.

అలాగే, విదేశీ క్రికెటర్ల (Cricketers) కోసం నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల ద్వారా నెదర్లాండ్స్‌, ఇంగ్లాండ్‌కు చెందిన ఆటగాళ్లు ఇప్పటికే పాకిస్థాన్‌ (Pakistan)కు వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమం పాకిస్థాన్ క్రికెట్ కోచింగ్ వ్యవస్థల బలాబలాలను అంచనా వేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. భారత్–పాకిస్థాన్ సంబంధాలపై సరదాగా స్పందించిన ఆకిబ్, సాధారణ ప్రజల ఆలోచన ఒకలా ఉంటే, అధికార వ్యవస్థ దృష్టికోణం మరోలా ఉందని వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>