కలం, డెస్క్ : వెస్టిండీస్తో (India Vs West Indies) జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్లో భారత్కు భారీ షాక్ తగిలింది. 5 ఓవర్లకు 45 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది ఇండియా. ఓపెనర్ అభిషేక్ శర్మ 10 బంతుల్లో 10 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్.. కొన్ని బౌండ్రీలు చేసినప్పటికీ హోల్డర్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 6 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. 196 పరుగులు భారీ లక్ష్య ఛేదనలో భారత్కు ఇది భారీ ఎదురుదెబ్బనే చెప్పాలి. విండీస్ బౌలర్లలో హోసెన్ 2 ఓవర్లు బౌలింగ్ చేసి 22 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. హోల్డర్ ఒక ఓవర్ బౌలింగ్ వేసి ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం క్రీజ్లో సంజుశాంసన్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. వీరిలో సంజూ 10 బంతుల్లో 20 పరుగులు చేశాడు.

