epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఒకే లాంఛర్​ నుంచి రెండు మిస్సైల్స్​.. మళ్లీ సక్సెస్​

కలం, వెబ్​డెస్క్: భారత రక్షణ పరిశోధన, అభివృద్ది సంస్థ(డీఆర్​డీవో) ఖాతాలో మరో ఘనత చేరింది. ఒకే లాంఛర్​ నుంచి రెండు మిస్సైల్స్​ను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని (Odisha) చాందీపూర్​లో ఉన్న డాక్టర్​ ఏపీజే అబ్దుల్​ కలాం అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ఈ ప్రయోగం జరిపింది. ఒకే లాంఛర్​ నుంచి రెండు ‘ప్రళయ్​’ క్షిపణుల (Pralay Missiles) ను సక్సెస్​ఫుల్​గా ప్రయోగించింది. ఈ మిస్సెల్స్​ను నిర్ణీత వ్యవధిలో ఒకే లాంచర్​ నుంచి ప్రయోగించి, పరీక్షించడం గత ఆరునెలల్లో ఇది రెండోసారి. యూజర్​ ఎవాల్యుయేషన్​ ప్రక్రియలో భాగంగా ఈ టెస్ట్​ నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మిస్సెల్స్​ నిర్దేశిత రూట్​లో టార్గెట్​ను ఛేదించాయని చెప్పింది. ఈ మేరకు ఇంటెగ్రేటెడ్​ టెస్ట్​ రేంజ్​(ITR​) ఏర్పాటుచేసిన ట్రాకింగ్ సెన్సార్లు ధ్రువీకరించినట్లు పేర్కొంది. టార్గెట్స్​కు దగ్గరలో మోహరించిన నౌకల్లోని టెలిమెట్రీ సిస్టమ్స్​ కూడా నిర్దారించినట్లు తెలిపింది.

కాగా, ప్రళయ్ (Pralay Missiles)​.. దేశీయంగా అభివృద్ధి చేసిన బాలిస్టిక్​ క్షిపణి. ఘన ఇంధనంతో పనిచేస్తుంది. అత్యాధునిక గైడెన్స్​, నావిగేషన్స్​ ఉన్నాయి. టార్గెట్​ను ఛేదించడంలో అత్యంత కచ్చితత్వంతో పనిచేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా వివిధ దశల్లోని లక్ష్యాలను ఒకేసారి ఛేదించడానికి వేర్వేరు వార్​హెడ్​లను మోసుకెళ్తుంది. ప్రళయ్​ మిస్సైల్స్​ను హైదరాబాద్​ డీఆర్​డీవోలోని రీసెర్చ్​ సెంటర్​ ఇమారత్​(RCI) డెవలప్​ చేసింది. ఇందులో డీఆర్​డీవోకు చెందిన వివిధ లేబొరేటరీలు భాగస్వామ్యమయ్యాయి. ప్రయోగం విజయవంతం కావడంతో డీఆర్​డీవోకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అభినందనలు తెలిపారు.

Read Also: 2025లో AI ఎఫెక్ట్ ఏ రంగం మీద పడింది?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>