కలం, వెబ్ డెస్క్: ధర్మశాల వేదికగా జరిగిన అప్ఘానిస్థాన్ వర్సెస్ ఇండియా (IND vs AFG) వన్డే మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. అప్ఘాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz) సెంచీతో మెరిసినా లాభం లేకుండా పోయింది. అప్ఘాన్ను పరాజయమే పలకరించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) పరుగుల వర్షం కురిపించాడు. గిల్కు మిగిలిన ప్లేయర్లు మంచి తోడ్పాడు అందించారు. ఇక బౌలర్ల విషయానికి వస్తే భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లతో వీరవిహారం చేయగా.. అప్ఘాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ గుడ్డిలో మెళ్లగా నిలిచాడు. అందరికంటే మంచి ఎకానమీ బౌలింగ్ చేయడమే రషీద్కు ప్లస్గా మారింది. దీంతో అప్ఘానిస్థాన్ ఇచ్చిన 195 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్ల నష్టానికి 22.5 ఓవర్లకే ఛేదించి విజేతగా నిలిచింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న అప్ఘానిస్థాన్కు భారత పేసర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ కేవలం 1 పరుగు చేసి గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రమాదకరమైన సెడికుల్లా అటల్ (0)ను అర్ష్దీప్ సింగ్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపగా, రహ్మత్ షా (3) సైతం అర్ష్దీప్ బౌలింగ్లోనే శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు. 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన అప్ఘాన్ను ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ అద్భుత ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. కేవలం 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 200 స్ట్రైక్ రేట్తో 102 పరుగులు చేసి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతనికి కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (30 బంతుల్లో 27, 3 ఫోర్లు), అజ్మతుల్లా ఒమర్జాయ్ (16 బంతుల్లో 26, 3 సిక్సర్లు) కాసేపు సహకారం అందించారు. మొహమ్మద్ నబీ (9), రషీద్ ఖాన్ (9), జియావుర్ రహ్మాన్ (4) తక్కువ పరుగులకే అవుట్ కాగా, ఏఎం గజన్ఫర్ డకౌట్ అయ్యాడు, మొహమ్మద్ సలీమ్ 1 పరుగుతో నాటౌట్గా నిలిచాడు. ఎక్స్ట్రాల రూపంలో 12 పరుగులు రావడంతో అప్ఘానిస్థాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ 4.5 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, హర్ష్ దూబే 5 ఓవర్లలో 47 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్ (2/27), నితీష్ కుమార్ రెడ్డి (2/31) రెండేసి వికెట్లతో రాణించగా ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్లకు వికెట్లు దక్కలేదు.
195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో 16 పరుగులు చేసి రషీద్ ఖాన్, గుర్బాజ్ చేతిలో దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 34 పరుగులు చేసి జోరు మీదుండగా రషీద్ ఖాన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 15 బంతుల్లో 1 ఫోర్తో 12 పరుగులు చేసి జియావుర్ రహ్మాన్ బౌలింగ్లో మొహమ్మద్ సలీమ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ దశలో కెప్టెన్ శుభ్మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కలిసి అప్ఘాన్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను ముగించారు. గిల్ 66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలవగా, కేఎల్ రాహుల్ కేవలం 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 205.26 స్ట్రైక్ రేట్తో 39 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఎక్స్ట్రాల రూపంలో భారత్కు 10 పరుగులు లభించాయి.
అప్ఘానిస్థాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 5 ఓవర్లలో 37 పరుగులిచ్చి 1 వికెట్ తీసి అత్యుత్తమ ఎకానమీ (7.40) నమోదు చేయగా, జియావుర్ రహ్మాన్కు 4 ఓవర్లలో 39 పరుగులకు 1 వికెట్ దక్కింది. అజ్మతుల్లా ఒమర్జాయ్, ఏఎం గజన్ఫర్, మొహమ్మద్ సలీమ్, మొహమ్మద్ నబీ వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. భారత్ 22.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.

