epaper
Monday, January 19, 2026
spot_img
epaper

‘సి–మిత్ర’​.. పది రోజుల్లోనే వంద ఎఫ్​ఐఆర్​లు!

కలం, వెబ్​డెస్క్​: సైబర్​ నేరాల్లో బాధితులు నేరుగా ఆన్​లైన్​ ద్వారా ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రవేశపెట్టిన ‘సి–మిత్ర’ (C Mitra) యాప్​కు అద్భుత స్పందన వస్తోంది. ఈ యాప్​ను ప్రారంభించిన పది రోజుల్లోనే సైబర్​ నేరాల గురించి ఆన్​లైన్​ ద్వారా వెయ్యి మంది ఫిర్యాదు చేయగా, ఏకంగా వంద ఎఫ్​ఐఆర్​లు రికార్డయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్​ సిటీ పోలీసులు వెల్లడించారు.

సాధారణంగా సైబర్​ నేరాల కేసుల్లో బాధితులు పోలీసు స్టేషన్​కు రావడానికి ఇబ్బంది పడుతుంటారు. పరువు పోతుందని ఫిర్యాదుకు వెనకడుగు వేస్తుంటారు. అలాగే స్టేషన్​లో ఫిర్యాదు ప్రక్రియ కూడా కష్టమైన పనే. అందువల్ల చాలా మంది స్టేషన్​ గడప తొక్కరు. ఈ పరిస్థితి సైబర్​ నేరగాళ్లకు వరంలా మారింది. దీనిని అడ్డుకోవడానికి, బాధితులకు అండగా ఉండడానికి తెచ్చిందే ‘సి–మిత్ర’ యాప్​. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ దీనిని ప్రారంభించారు. ఈ క్రమంలో పది రోజుల్లోనే వెయ్యి ఫిర్యాదులు, వంద ఎఫ్​ఐఆర్​లు నమోదవడం సి–మిత్రకు లభిస్తున్న స్పందన తెలియజేస్తోంది.

ఎలా పనిచేస్తుంది?

సి–మిత్ర (C Mitra) యాప్​ కోసం హైదరాబాద్​ పోలీసులు 24 మందితో కూడిన ప్రత్యేక డెస్క్​ ఏర్పాటుచేశారు. ఇది 24 గంటలూ పనిచేస్తుంది. సైబర్​ నేరం గురించి 1930 హెల్ప్​లైన్​ లేదా నేషనల్​ సైబర్​ క్రైమ్​ రిపోర్టింగ్​ పోర్టల్​ ద్వారా సమాచారం అందిన వెంటనే సి–మిత్ర బృందం బాధితులను సంప్రదిస్తుంది. వివరాలను సేకరిస్తుంది. అనంతరం ఏఐ ద్వారా చట్టపరంగా సరైన ఫిర్యాదు ముసాయిదా తయారుచేస్తుంది. దీనిని బాధితులకు వాట్సాప్​ లేదా ఈ–మెయిల్​ ద్వారా పంపిస్తారు. బాధితులు దీనిని ప్రింట్​ తీసుకొని, సంతకం చేసి హైదరాబాద్​లోని బషీర్​బాగ్​లో ఉన్న సైబర్​ క్రైమ్​ పోలీస్​ స్టేషన్​కు కొరియర్​ లేదా పోస్ట్​ ద్వారా పంపాలి. ఇది అందిన వెంటనే సైబర్​ క్రైమ్​ పోలీసులు ఎఫ్​ఐఆర్​ సిద్ధం చేసి నేరుగా బాధితుల మొబైల్​కు పంపిస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>