కలం, వెబ్ డెస్క్: కడప జిల్లా ప్రొద్దుటూరులో (Proddatur) సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన భార్య లావుగా ఉందనే కారణంతో ఆమెను వదిలించుకోవాలని పథకం వేసిన భర్త దారుణంగా హత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్లో వెతికి మరీ విషాన్ని ఆర్డర్ చేసి, భార్యకు ఇచ్చి ప్రాణాలు తీశాడు. తొలుత సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. కానీ పోలీసులకు అనుమానం వచ్చి లోతైన దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య (Wife) ప్రాణం తీయడానికి ఆన్లైన్ వాడుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

