కలం, వెబ్ డెస్క్: అనంతపురం (Anantapur) జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ హాస్టల్లో గోడ కూలి విద్యార్థి మృతి చెందాడు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరులో ఈ ఘటన జరిగింది. స్థానిక ఎస్సీ హాస్టల్ లో ఉంటూ 8వ తరగతి చదువుతున్న హర్ష వర్ధన్, అక్షయ్ బహిర్బూమికి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్క సారిగా గోడ కూలిపోయింది. దీంతో హర్షవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అక్షయ్కి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. హర్షవర్ధన్ మృతితో కుటుంబసభ్యులు తీవ్ర దుఖంలో మునిగిపోయారు.

