కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామంలో తేనెటీగల దాడి (Honey Bee Attack) గ్రామస్తులను భయభ్రంతులకు గురి చేసింది. వెంకటపురంలో శుక్రవారం ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో రోడ్డు పైన, బయట ఉన్న సుమారు 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిలో కొంత మందిని 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అందరికీ అంబులెన్స్ సరిపోకపోవడంతో ఎవరికి వారే ఆసుపత్రి వైపు పరుగులు పెట్టారు. తేనెటీగల గుంపు దాడితో వెంకటాపురం గ్రామస్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనలో సుధాకర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
-సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామంలో తేనెటీగలు దాడి
-ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పలువురు గ్రామస్థులు
-దాడిలో గాయపడిన కొందరిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలింపు
-మరికొందరు బాధితులు సమీప ఆసుపత్రుల్లో చేరిక
#Sangareddy #Sadasivapet #Venkatapuram #BeeAttack… pic.twitter.com/Jzi7HKbfRJ— Kalam Daily (@kalamtelugu) March 13, 2026
Read Also: బ్రేకప్ నుంచి ‘మూవ్ ఆన్’ అవ్వడం ఎలా..?
Follow Us On: Instagram

