epaper
Monday, March 2, 2026
epaper

జీతాలు వచ్చి నాలుగు నెలలు.. గోడు వెల్లబోసుకున్న వైద్య సిబ్బంది

తమకు నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని, దాని వల్ల ఇల్లు గడవడం కూడా కష్టమవుతోందంటూ ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖానా వైద్య సిబ్బంది తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంగళవారం ఈ దవాఖానాను మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) సందర్శించారు. అక్కడ అందుతున్న సదుపాయాలు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనతో సిబ్బంది తమ సమస్యలు వివరించారు. తమకు నాలుగు నెలల నుంచి జీతం రాలేదని తెలిపారు. అయితే ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, బస్తీ దవాఖానాల్లో పెండింగ్‌లో ఉన్న జీతాలను త్వరితగతిన అందించాలని ప్రభుత్వాన్ని కోరతామని హరీష్ రావు చెప్పారు. వైద్య సిబ్బంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో బీఆర్ఎస్ ముందుంటుందని అన్నారు.

Read Also: దీపావళి వేడుకల్లో 70 మందికి గాయాలు..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!