కలం, వెబ్ డెస్క్: ’ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెడుతున్న కేసులకు నేను భయపడను. తన మీద వచ్చిన ఆరోపణలను డైవర్ట్ చేసేందుకే రేవంత్ రెడ్డి నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు‘ అంటూ హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మంగళవారం సిట్ ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన మీద వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) ఆరోపణలు ట్రాష్ అని వ్యాఖ్యానించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కూడా తనకు క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. అయినప్పటికీ కక్ష పూరితంగా తన మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. విచారణలో భాగంగా అధికారులు ఓ గంట ప్రశ్నలు అడగటం.. మళ్లీ బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడటం.. మళ్లీ తిరిగివచ్చి ప్రశ్నలు అడగటం ఇదే జరిగిందని హరీశ్ (Harish Rao) పేర్కొన్నారు.
Read Also: ఏఐ రంగంలో తెలంగాణతో భాగస్వామ్యానికి రాయల్ ఫిలిప్స్ ఆసక్తి
Follow Us On: X(Twitter)


