కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం స్టేజీ వద్ద రాజీవ్ రహదారిపై రైతులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ఆయన ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: భువనేశ్వర్లో షాకింగ్ ఘటన.. పబ్లిక్లో యువతిపై దాడి, వీడియో చూస్తే!
Follow Us On: Instagram

