కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ తో దేశ వ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ గ్యాస్ సిలిండర్ల (Gas cylinders) లారీ బోల్తా పడింది. రాజస్థాన్ లోని కిషన్ గఢ్ టోల్ ప్లాజాకు దగ్గర్లో హైవే మీద లారీ అదుపు తప్పి బోల్తా పడటంతో సిలిండర్లన్నీ రోడ్డు మీద పడిపోయాయి.
రోడ్డు పొడవునా సిలిండర్లు దొర్లుకుంటూ వెళ్లాయి. దీంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. కానీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. 145 గ్యాస్ సిలిండర్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సిలిండర్లను (Gas cylinders) వాహనంలోకి ఎక్కించి తరలించారు.

