గాంధీ విగ్రహం ఏర్పాటు.. సీఎం అపోహలు తొలగించాలి : తుషార్​ గాంధీ

కలం, వెబ్​ డెస్క్​: హైదరాబాద్​లో మూసీ నది (Musi River) పక్కన మహాత్ముని విగ్రహం ఏర్పాటుపై కొనసాగుతున్న వివాదం మీద గాంధీ మనవడు తుషార్​ గాంధీ (Tushar Gandhi) మరోసారి స్పందించారు. విగ్రహం ఏర్పాటుపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలని సీఎం రేవంత్​ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం తన ‘ఎక్స్​’ ఖాతాలో ఓ ట్వీట్​ పోస్ట్​ చేశారు. ‘హైదరాబాద్‌లో గాంధీజీ విగ్రహం ఏర్పాటు కోసం ప్రజలను తరలిస్తున్నారనే అపోహలను నివృత్తి చేసేలా సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy) స్పష్టమైన ప్రకటన చేయాలి. నగర పౌరులు తమ ఇళ్లను కోల్పోతున్నది గాంధీ విగ్రహ నిర్మాణం కారణంగానే అనే భావన వ్యాపించడం గాంధీజీ కీర్తికి అపప్రథ తెచ్చేలా ఉంది. అందువల్ల సీఎం రేవంత్​ రెడ్డి ఈ విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఆ ట్వీట్​లో తుషార్ గాంధీ పేర్కొన్నారు.

కాగా, అంతకుముందు సైతం ఇదే విషయంపై తుషార్​ గాంధీ(Tushar Gandhi )‘ఎక్స్​’ స్పందించిన విషయం తెలిసిందే. ప్రజల ఇళ్లను కూల్చి గాంధీజీ విగ్రహం కట్టడం, మహాత్ముని ఆదర్శాలకు వ్యతిరేకమని అప్పట్లో ఆయన ట్వీట్​ చేశారు. ఇప్పుడు మరోసారి తుషార్​ గాంధీ ఈ విషయంపై స్పందిస్తూ సీఎంను ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read Also: వాణిజ్య గ్యాస్ స‌ర‌ఫ‌రాపై నిఘా.. ముగ్గురు అధికారుల‌తో క‌మిటీ

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>