కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల-2025 (Gaddar Film Awards)వేడుక హైటెక్ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్నారావు, సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, మురళీమోహన్, నాగచైతన్య, శోభిత, అమలతో పాటు పలువురు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చిరంజీవి జ్యోతి ప్రజ్వలన చేసి అవార్డుల వేడుకను ప్రారంభించారు. అనంతరం కొందరికి అవార్డులు కూడా అందజేశారు. వేడుక ఇంకా కొనసాగుతోంది.

