కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ చలనచిత్ర పురస్కారాలు (Gaddar Film Awards) 2025 వేడుకల్లో భాగంగా రేపటి నుంచి సినిమాల ప్రదర్శన ప్రారంభం కానుంది.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ప్రసాద్ ఫిలిం ల్యాబ్లో ఫిబ్రవరి 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్క్రీనింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పాల్గొననున్నారు.
Read Also: ఇవి కార్యకర్తల ఎన్నికలు : రేవంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)


