కలం, ములుగు : ములుగు (Mulugu) జిల్లాలోని గోవిందరావుపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయం స్టోర్ రూమ్లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు. కార్యాలయంలో భద్రపరిచిన ముఖ్య రికార్డులు మంటల్లో కాలిపోయినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


