కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో తల్లి నందిని (26), కన్నయ్య (7 నెలలు) స్పాట్లోనే చనిపోయారు. తండ్రి ప్రకాష్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ మండలం స్నేహ కంపెనీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

