కలం, వెబ్డెస్క్: ప్రకాశం (Prakasam) జిల్లా ఉలవపాడు మండలంలో ఊహించని రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. కరేడు గ్రామానికి చెందిన తండ్రికొడుకులు రూ. 9 లక్షల నగదు తీసుకుని బైక్పై బయలుదేరారు. మార్గమధ్యలో ఫోన్ రావడంతో బైక్ను రోడ్డు పక్కన ఆపి, అక్కడే ఉన్న ఒక ఆటో పక్కన నిలబడి మాట్లాడుతున్నారు.
ఈ క్రమంలో అతివేగంగా వచ్చిన ఒక లారీ అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలోని మామిడి కాయల ట్రేలు, ఆటో ఒక్కసారిగా తండ్రికొడుకులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తండ్రి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోగా.. కొడుకుకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

