కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కిన్నెరసాని వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ములకలపల్లి మండలానికి చెందిన మడకం కన్నారావు తన బైక్ పై వెళ్తుండగా కిన్నెరసాని వంతెన సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కన్నారావు(28) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్పై ఉన్న దంపతులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని, బాధితులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.

